ఉపాధ్యాయుల నియామకం కుంభకోణంలో అడ్డంగా బుక్కైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేటు వేశారు. తన కేబినెట్ నుంచి చటర్జీని తొలగిస్తూ గురువారం మమతా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో పార్థా చటర్జీ ఇప్పటికే అరెస్టైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ టీచర్ల కుంభకోణం జరిగిన వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత వారం చటర్జీ సన్నిహితురాలి ఇంటిలో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో గుట్టలుగుట్టలుగా కరెన్సీ కట్టలు దొరికాయి. తాజాగా బుధవారం కూడా మరో ఇంటిలో సోదాలు చేసిన ఈడీ… అక్కడ కూడా రూ.41 కోట్ల నగదుతో పాటు 5 కిలోల బంగారం దొరికింది.