Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘బెడ్‌ రోల్స్‌’ కావాలంటే జేబులు ఖాళీ

రైలు ప్రయాణీకులకు దుర్వార్త
ఇక మీదట అన్నీ డిస్పోజబుల్‌
రూ.30 నుంచి రూ.300 వరకు బాదుడు
రైల్వేశాఖ కొత్త విధానం
న్యూదిల్లీ :
రైల్వే ప్రయాణీకులకు దుర్వార్త.. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్‌ కావాలంటే జేబులకు చిల్లు పడినట్లే. శీతాకాలం ప్రారంభం కావడంతో బెడ్‌ రోల్స్‌ (బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, దిండు) డిమాండ్‌ బాగా పెరుగుతోంది. దీనిని అధిగమించేందుకు రైల్వే శాఖ కొత్త మార్గాన్ని అన్వేషించింది. దేశ రాజధాని దిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించేందుకు స్టేషన్లలో అల్ట్రా-వైలెట్‌ బేస్డ్‌ లగేజ్‌ శానిటైజేషన్‌ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ. 300 వరకు చెల్లించాల్సి వస్తుంది. కాగా కరోనా వైరస్‌ మొదటి దశ ప్రారంభం నుంచి రైల్వే శాఖ బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, దిండు ఇవ్వడాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రైల్వే.. అంచలంచలుగా రైలు సర్వీసులను ప్రారంభిస్తూ వస్తోంది. ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లోని ఏసీ కోచ్‌లలో బెడ్‌ రోల్స్‌ సౌకర్యం లేదు. ప్రయాణీకులు తమ వెంటే దుప్పట్లు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ సౌకర్యాన్ని మొదలు పెట్టింది. దీని కోసం మూడు రకాల కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి ఏంటంటే : ఒకటవ కిట్‌.. దీని కోసం ప్రయాణీకులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. దుప్పటి, దిండు (నేసినవి కావు), బెడ్‌ షీట్‌, బ్యాగ్‌, టూత్‌పేస్ట్‌, హెయిర్‌ ఆయిల్‌, దువ్వెన, శానిటైజర్‌ సాచెట్‌, పేపర్‌ సబ్బు, టిష్యూ పేపర్‌ అందుబాటులో ఉంటాయి. రెండో కిట్‌.. ఇందుకు ప్రయాణీకులు రూ. 150 చెల్లించాలి. ఈ కిట్‌లో కేవలం దుప్పట్లు మాత్రమే ఉంటాయి. ఇక మూడవ కిట్‌ కోసం ప్రయాణీకులు రూ. 30 చెల్లించాలి. టూత్‌పేస్ట్‌, టూత్‌ బ్రష్‌, హెయిర్‌ ఆయిల్‌, దువ్వెన, శానిటైజర్‌, పేపర్‌ సబ్బు, టిష్యూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం దిల్లీ రైల్వే డివిజన్‌లో 57 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని స్టేషన్లలో ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img