Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత్‌ జోడో యాత్ర పునః ప్రారంభం..పాదయాత్రలో పాల్గొన్న సోనియగాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రారంభించిన ‘భారత్‌ జోడో’ యాత్రలో సోనియాగాంధీ నేడు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం రాహుల్‌ యాత్ర కర్ణాటకలో సాగుతోంది. యాత్రలో పాల్గొనేందుకు జకన్న హళ్లి చేరుకున్న సోనియా.. మాండ్యా జిల్లాలోని పాండపుర తాలూకా నుంచి ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన యాత్రలో పాలుపంచుకున్నారు. సాయంత్రం ఏడు గంటలకు నాగమంగళ తాలూకాలో యాత్ర ముగుస్తుంది. అనంతరం బ్రహ్మదేవరహళ్లి మీటింగులో సోనియా పాల్గొంటారు. సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర గత శుక్రవారం కర్ణాటకలోకి ఎంటరైంది. కేరళ సరిహద్దులోని చామరాజ్‌నగర్‌లోని గుండులుపేటలో అడుగుపెట్టడం ద్వారా రాహుల్‌ కర్ణాటకలో కాలుమోపారు. నేటి యాత్రకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్‌ ట్విట్టర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఆశ, ప్రేమ, విజయాల ప్రయాణమిది. భారత్‌ జోడో యాత్ర స్ఫూర్తి ఇదే’ అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img