22 స్థానాల్లో 92 అభ్యర్థుల పోటీ
మణిపూర్లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా తుది విడత 22 స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. 22 సీట్లలో 92 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 8,38,730 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కోవిడ్ పాజిటివ్ లేదా క్వారంటైన్లో ఉన్న ఓటర్లు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చివరి గంటలో ఓటు వేయడానికి అనుమతించనున్నారు. రెండో విడత ఎన్నికలు తౌబాల్, జిరిబం, చండేల్, ఉఖ్రూల్, సేనాపతి, టామెన్ గ్లాంగ్ జిల్లాల్లో కొనసాగుతోంది. 1247 పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసుల పహరా మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇంఫాల్ ఈస్ట్, చురాచంద్ పూర్ జిల్లాల్లోని 12 పోలింగ్ కేంద్రాల్లోనూ రీ పోలింగ్ సాగుతోంది.