Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మధ్యప్రదేశ్‌లో యూనివర్సిటీపై బాంబు దాడి..

మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పూర్‌ లో ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌ పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి రెండు నాటు బాంబులు విసిరాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులు విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్లు అతడిని పట్టుకునేందుకు పరిగెత్తగా.. దుండగుడు బైక్‌ పై పరారయ్యాడు. క్యాంటీన్‌ బయట ఈ దాడి జరిగిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.మరోవైపు ఈ ప్రాంతంలో పేలని రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ‘‘యూనివర్సిటీలోని క్యాంటీన్‌ బయట గుర్తుతెలియని వ్యక్తి బాంబులు విసిరినట్లు మాకు సమాచారం వచ్చింది. ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రమేశ్‌ కౌరవ్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img