https://www.fapjunk.com https://pornohit.net getbetbonus.com deneme bonusu veren siteler bonus veren siteler popsec.org london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg getbetbonus.com deneme bonusu veren siteler bonus veren siteler getbetbonus.com istanbul bodrum evden eve nakliyat pendik escort anadolu yakası escort şişli escort bodrum escort
Aküm yolda akü servisi ile hizmetinizdedir. akumyolda.com ile akü servisakumyolda.com akücüakumyolda.com akü yol yardımen yakın akücü akumyoldamaltepe akücü akumyolda Hesap araçları ile hesaplama yapmak artık şok kolay.hesaparaclariİngilizce dersleri için ingilizceturkce.gen.tr online hizmetinizdedir.ingilizceturkce.gen.tr ingilizce dersleri
It is pretty easy to translate to English now. TranslateDict As a voice translator, spanishenglish.net helps to translate from Spanish to English. SpanishEnglish.net It's a free translation website to translate in a wide variety of languages. FreeTranslations
Friday, March 29, 2024
Friday, March 29, 2024

మళ్లీ ఎలక్టోరల్‌ బాండ్లు

జనవరి 1 నుంచి 10 వరకు విక్రయాలు : కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన
పథకం పారదర్శకతపై విపక్షాల ఆందోళన
అవినీతి పెరిగేందుకు ఆస్కారం : హక్కుల కార్యకర్తలు
పెండిరగ్‌ పిటిషన్లను విచారించాలని సుప్రీంకు వినతి

న్యూదిల్లీ : ఎలక్ట్రోరల్‌ బాండ్ల 19వ దశ విక్రయాలు జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. దీంతో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల కారణంగా అవినీతి పెరిగిపోతుందని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండిరగ్‌లో ఉండటంతో వాటిని విచారించాలని ప్రతిపక్ష నేతలు విన్నవిస్తున్నారు. ఈ బాండ్ల రూపేణ వచ్చే నిధుల మూలాలను వెల్లడిరచాల్సిన అవసరం లేకపోవడంతో కొన్ని రాజకీయ పార్టీలకు భారీస్థాయిలో కలిసివస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యంగబద్ధతపై సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పెండిరగ్‌ల ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 29 అధీకృత శాఖలు మాత్రమే ఎన్నికల బాండ్లను విక్రయిస్తాయి. బాండ్ల జారీ, ఎన్‌క్యాష్‌ బాధ్యతలను ఎస్‌బీఐ మాత్రమే చేపడుతుంది. 2018లో ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం తీసుకు వచ్చింది. తద్వారా పౌరులు ఎవరైనాగానీ బాండ్లను కొనుగోలు చేయోచ్చు అని పేర్కొంది. ఈ పథకం ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం,1951లోని సెక్షన్‌ 29ఎ కింద నమోదు అయిన రాజకీయ పార్టీలు, గత సార్వత్రిక ఎన్నికలు లేదా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకశాతానికి తగ్గకుండా ఓట్లు గడిస్తేనే ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసి బ్యాంకు ఖాతా ద్వారా నగదు అందుకోవచ్చు. విరాళాల విషయంలో పారదర్శకత లేకపోవడంతోఈ పథకంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు కాగా ఇవన్నీ పెండిరగ్‌లో ఉన్నాయి. ఈ పథకం తాత్కాలిక నిలుపుదలకు సర్వోన్నత న్యాయస్థానం రెండుసార్లు నిరాకరించింది. ఎలక్ట్రోరల్‌ బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తాల్లో గుర్తించని వర్గాల ద్వారా విరాళాలు వచ్చిపడతాయని, తద్వారా ప్రజాస్వామిక స్ఫూర్తి దెబ్బతింటుందని విపక్షాలు పేర్కొన్నాయి. ఇదే విషయమై జులైలో సీపీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అవినీతికి తావు లేకుండా ఎవరెవరు విరాళాలు ఇస్తున్నారో తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పథకం చెల్లుబాటు అవుతందా లేదా అని ప్రశ్నించింది. విరాళాల విషయంలో పారదర్శకత లోపిస్తుందని సీపీఎం పిటిషన్‌ పేర్కొంది. ఈ పథకం నేపథ్యంలో వచ్చే గుర్తించని విరాళాలు ప్రజాస్వామిక పనితీరుకు సవాల్‌ విసురుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వివిధ రాజకీయ పార్టీలకు వేల కోట్లు విరాళాలు బాండ్ల ద్వారా వస్తున్నాయని, తద్వారా ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిట్లుతోందని సీపీఎం పేర్కొంది. బాండ్ల అమ్మకం ద్వారా ఏయే కార్పొరేట్‌ సంస్థ, కంపెనీ విరాళాలు ఇచ్చిందో వెల్లడిరచాలని, ఈ సమాచారం తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని వెల్లడిరచింది. ఎన్నికల బాండ్ల అమ్మకం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు కాగా ఇవన్నీ 2018 నుంచి పెండిరగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తుచేసింది.ఎలక్టోరల్‌ బాండ్ల వల్ల అవినీతి పెరిగిపోతుందని, పెండిరగ్‌ పిటిషన్లను విచారించాలని హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. రాజకీయ పార్టీలకు అనామక మార్గాల నుంచి వచ్చే విరాళాలకు వడ్డీ లేని సాధనాలుగా ఎలక్టోరల్‌ బాండ్లు ఉపయోగపడతాయని అంటున్నాయి. ఆరోపణల్లో నిజం లేకపోలేదు... ఎలక్టోరల్‌ బాండ్ల మొత్తం డబ్బులో దాదాపు 3/4వ వంతు కాషాయపార్టీ ఖాతాలోకి వెళుతుందన్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఈ పథకంతో అత్యధిక లబ్ధి పొందిన పార్టీ బీజేపీ మాత్రమే. కాషాయ పార్టీకి 76శాతం నిధులు ఎలక్టోరల్‌ బాండ్ల రూపేణ 201920 ఆర్థిక సంవత్సరంలో సమకూరినట్లు ఆగస్టులో ది వైర్‌ పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం ఎన్డీటీవీ ఓ నివేదిక ఇచ్చింది. ఆర్థిక సంవత్సరంలో అమ్మిన మొత్తం బాండ్ల నుంచి తొమ్మిది శాతం మొత్తాన్ని కాంగ్రెస్‌ పొందినట్లు పేర్కొంది. మొత్తంగా 201920లో రూ.3,355 కోట్ల విలువచేసే ఎలక్టోరల్‌ బాండ్లు అమ్ముడుపోయాయి. ఈ మొత్తంలో నుంచి రూ.2,555 కోట్లు బీజేపీ పొందింది. అంటే అంతకుముందు ఏడాదితో పోల్చితే విరాళాల్లో 75శాతం పెంపు ఉంది. కాంగ్రెస్‌ విరాళాల్లో 17శాతం క్షీణత నమోదు కాగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.383 కోట్లు సమకూరాయి. కార్పొరేట్‌లు, రాజకీయ నేతలకు తెరవెనుకున్న ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఎన్నికల బాండ్లు ఒక సాధనంగా మారాయని, కేంద్ర ఎన్నికల సంఘం 2017లో బాండ్ల అమ్మకంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేసిందని, ఈ అంశంపై దాఖలైన పిటిషన్లన్నింటినీ వెంటనే విచారించాలని సుప్రీంకోర్టును విపక్షాలు కోరాయి. 70శాతం విరాళాలు లెక్కాపత్రం లేనివే : ఏడీఆర్‌ వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా వచ్చిన మొత్తంలో 70శాతం లెక్కాపత్రం లేనివే అని ఏడీఆర్‌ పేర్కొంది. 201920లో అనామక వర్గాల ద్వారా రూ.3,377.41 కోట్లను పార్టీలు పొందాయని, ఇది మొత్తం ఆదాయంలో 70.98 శాతమని వెల్లడిరచింది. రూ.3,377.41 కోట్లలో రూ.2,993.82 కోట్లు లేదా 88.64శాతం ఆదాయం ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి వచ్చిందేనని తెలిపింది. నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది పార్టీలు సమర్పించే ఐటీ రిటర్న్స్‌లోనూ ఉండటం లేదని పేర్కొంది. రూ.20వేల కంటే తక్కువ విరాళాలు ఇచ్చే వ్యక్తులు, సంస్థల పేర్లు, వివరాలుగానీ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చే విరాళాల వివరాలనుగానీ రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో సమస్య జఠిలమైందని ఏడీఆర్‌ తెలిపింది. 15 ఏళ్లలో వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా, ఇతర మార్గాల్లో వచ్చిన లెక్కాపత్రం లేని విరాళాలు దాదాపు రూ.14,651 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2019-20లో గుర్తించలేని వర్గాల ద్వారా సమకూరిన ఆదాయం రూ.2,642 కోట్లు అని బీజేపీ తెలిపినట్లు ఏడీఆర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. తమకు రూ.526 కోట్ల ఆదాయం సమకూరినట్లు కాంగ్రెస్‌ పార్టీ పేర్కొందని తెలిపింది. ఈ క్రమంలో జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో ఇది 15.57శాతంగా ఉన్నట్లు వెల్లడిరచింది. గుర్తించలేని వివిధ మాధ్యమాలు / వర్గాల ద్వారా సమకూరుతున్న ఆదాయం, ఎలక్టోరల్‌ బాండ్ల రూపేణ వచ్చే విరాళాలు, కూపన్ల విక్రయాలు, సహాయ నిధులు, స్వచ్ఛంధ విరాళాలు, సమావేశాలు / మోర్చాలకు తోడ్పాటు వంటివాటి ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయంపై నిఘా వ్యవస్థ అవసరమని సూచించించింది. కాగ్‌, ఎన్నికల కమిషన్‌ ఆమోదిత సంఘాన్ని ఇందుకోసం ఏర్పాటు చేయాలని ఏడీఆర్‌ నివేదిక నొక్కిచెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img