ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడిరచారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలోనే ఉన్నారని, నిపుణులైన వైద్యబృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు.కాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారా అప్డేట్స్ ఇస్తున్నారు.