Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మళ్లీ పాత లిక్కర్‌ పాలసీ

ఢల్లీిలోని ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ మళ్లీ పాత లిక్కర్‌ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తెలిపారు. ఢల్లీిలో నాటు సారా విషాదాలను సహించబోమని, అందుకే కొత్త లిక్కర్‌ విధానం బదులుగా, మద్యాన్ని పాత పద్ధతిలోనే అమ్మనున్నట్లు సిసోడియా తెలిపారు. కొత్త విధానాన్ని సమర్ధించిన సిసోడియా.. అవినీతిని అడ్డుకునేందుకు ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎక్సైజ్‌ పాలసీ గడువు ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల గుజరాత్‌లో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారు. అయితే అలాంటి సంఘటనలు ఢల్లీిలో జరగనివ్వబోమని సిసోడియా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img