Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఢీకొన్న రెండు రైళ్లు.. 53 మందికి గాయాలు

మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గోందియా జిల్లాలో ఓ ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 53 మందికి గాయాలయ్యాయి. వీరిలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగ్‌పూర్‌ నుంచి రాయ్‌పూర్‌ వెళ్తున్న భగత్‌కి కోటి ఎక్స్‌ప్రెస్‌ను.. ఓ గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. దీంతో మూడు ప్యాసింజర్‌ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే సిగ్నల్‌ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్‌ సమస్య తలెత్తి.. ఒకే పట్టాలపై ఎదురెదురుగా రైళ్లు వచ్చాయి. దాంతో ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడిరచారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారిని గోందియా ప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా.. మరికొందరిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img