కొత్తగా 27 డెల్టా వేరియంట్ కేసులు
మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజు 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.గడ్చిరోలి, అమరావతిలో ఆరు చొప్పున, నాగ్పూర్లో ఐదు, అహ్మద్నగర్లో నాలుగు, యావత్మల్లో మూడు, నాసిక్లో రెండు, భాంద్రాలో ఒకటి చొప్పున డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ముంబైలో 188 నమూనాలను సేకరించగా 128 నమూనాల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు తెలిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడిరచింది. మహారాష్ట్రలో తాజాగా 3643 కేసులు కొత్తగా నమోదయ్యాయి.