Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవీస్‌కు వై ప్లస్‌ భద్రత

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య అమృతా ఫడ్నవీస్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. మహారాష్ట్ర పోలీసుల రక్షణ, భద్రతా విభాగం ద్వారా ముప్పు అవగాహనను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. హీరో సల్మాన్‌ ఖాన్‌ సెక్యూరిటీని ఎక్స్‌ నుంచి వై ప్లస్‌ కి పెంచారు. అన్ని సమయాల్లో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌ వెంట ఉంటారు. అంతేకాకుండా ఆయన నివాసంలో 24 గంటలూ ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. సల్మాన్‌ ఖాన్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు రావడంతో ముంబై పోలీస్‌ ప్రొటెక్షన్‌ బ్రాంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్‌ కు ఇచ్చే భద్రతను ఇప్పుడు అమృతా ఫడ్నవీస్‌ కు కూడా అందిస్తారు. అదనంగా ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ వాహనం కూడా అమృత ప్రయాణిస్తున్న దారిలో అందుబాటులో ఉంచుతారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృత బహుముఖ ప్రజ్ఞాశాలి. గతంలో బ్యాంకర్‌ గా పని చేసిన ఆమె నటి, సింగర్‌, సామాజిక కార్యకర్త కూడా. ఆమె తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదివరకు దేవేంద్రతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల మహారాష్ట్రలో అధికారం చేతులు మారింది. ప్రతిపక్షంలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఫడ్నవీస్‌ కుటుంబానికి కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలోనే ఆయన భార్యకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img