Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి దుర్మరణం

ఔరంగాబాద్‌ : మహారాష్ట్రలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి హాజరై తిరిగి సొంతూళ్లకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో గురువారం జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సిల్లాడ్‌ తాలూకా మోధా ఫతా గ్రామ సమీపంలో టెంపో, ట్రాక్టర్‌ ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను టెంపో ఢీకొందని సిల్లాడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం మిత్రే చెప్పారు. టెంపోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన ఏడుగురిని సిల్లాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img