Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మహిళలపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు


కేరళ సీఎం విజయన్‌

తిరువనంతపురం : మహిళలు, చిన్ని పిల్లలపై నేరాలకు సంబంధించిన నమోదవుతున్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ పేర్కొన్నారు. కొత్త కోర్టుల ఏర్పాటు విషయంపై శాసన సభ్యుడు జేవియర్‌ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్నకు స్పందించిన సీఎం ఈ మేరకు స్పందించారు. రాష్ట్రంలో ఎటువంటి కొత్త కోర్టుల ఏర్పాటు ఆలోచన లేదని, ఆ విషయంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img