ఇజ్రాయెల్లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు విశ్వ సుందరి కిరీటం దక్కినట్లైంది. ఈ ఏడాది ‘లివా మిస్ దివా యూనివర్స్’ కిరీటాన్నీ సొంతం చేసుకోవడంతో హర్నాజ్కు ‘మిస్ యూనివర్స్-2021’లో భారత్ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్గా నిలవగా.. దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే రెండో రన్నరప్గా నిలిచారు. ఫిలిప్పీన్స్కు చెందిన బీట్రైస్ గోమెజ్ ఈ పోటీలో టాప్ 5లో నిలిచింది. గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సుస్మితాసేన్ (1994), లారాదత్తాలు (2000) మాత్రమే సాధించారు. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు హర్నాజ్ సంధు దక్కించుకోవడం విశేషం.