ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి డెల్టా వేరియంట్ మరణం నమోదైందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడిరచింది. ముంబైలో ఘట్కోపర్కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు డెల్టా వేరియంట్తో జులై 27న మరణించారు. ఆమెకు జులై 21న పాజిటివ్గా నిర్థారణ అయింది. ఆమెకు మధుమేహ వ్యాధితోపాటు అనేక వ్యాధులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆమె కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న తర్వాత మరణించారు. ఆమెతో కాంటాక్ట్లో ఉన్న ఇద్దరు సన్నిహితులకు పరీక్షలు చేశారు. ఆమె వైరస్ బారిన పడిన తర్వాత ప్రయాణాలు చేసిందా అనేదానిపైనా అధికారులు పరిశీలించారు. ఆమె కొద్దిరోజులుగా ఎలాంటి ప్రయాణాలు చేయలే దని అధికారులు గుర్తించారు. డెల్టా వేరియం ట్తో బాధపడుతున్న మహిళకు చికిత్స నిమిత్తం వైద్యులు స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్ ఇచ్చారని అధికారులు తెలిపారు. గత నెలలో రత్నగిరికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. దీంతో మహారాష్ట్రలో డెల్టా వేరియంట్తో ఇద్దరు మరణించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముం బైలో ఏడుగురు డెల్టా వేరియంట్తో బాధపడు తున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఆ రోగులను పరిశీలనలోకి తీసుకుంది. ఏడు శాంపిల్స్తోపాటు మరో 13 శాంపిల్స్ను పరీక్షిం చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూడు కేసులు పూణెలో, నాందేడ్లో రెండు, గోండియా, రాయగఢ్, పాల్ఘర్లో, చంద్రపూర్, అకోలాలో ఒక్కొక్కటిగా వైరస్ కేసులు ఉన్నాయి. దీంతో డెల్టాప్లస్ రోగుల సంఖ్య 65కి పెరిగింది. ఈ వేరి యంట్తో ఏడుగురు చిన్నారులు, ఎనిమిదిమంది సీనియర్ సిటిజన్లు బాధపడుతున్నారని అధికా రులు కనుగొన్నారు. అదేవిధంగా ఇటీవల వైరస్ సోకిన రోగులతో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం బుధవారం దేశవ్యాప్తంగా 86 డెల్టా వేరి యంట్ కేసులున్నాయని తెలిపింది. అయితే డెల్టా వేరియంట్ వైరస్ ఎక్కువగా విజృంభించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. డెల్టా వేరియంట్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోద య్యాయని జాతీయ ఆరోగ్య నియంత్రణ కేంద్రం చీఫ్ సుజిత్ సింగ్ మీడియా సమావేశంలో అన్నారు. మహారాష్ట్ర తరువాత మధ్యప్రదేశ్, తమిళనాడుల్లో నమోదయ్యాయని వెల్లడిరచారు. ‘డెల్టావేరియంట్ వైరస్ కేసులు నమోదవు తున్నాయి. కానీ ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందలేదని’ ఆయన అన్నారు.