మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడిరది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. 24 గంటల్లో.. వేర్వేరు కేసుల్లో రూ.7.87కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.22లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ నెల 11-12 మధ్య ఆయా కేసుల్లో ప్రమేయమున్న ఏడుగురు ప్రయాణికులను అరెస్టు చేశారు.