సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మేదాంత ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ములాయంకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పలు రకాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం.. గత ఆదివారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.