ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకి గురైయ్యారు. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు బులెటిన్ ద్వారా వెల్లడిరచారు. అయితే, అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడిరచలేదు. మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో మోడీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోడీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు.