మహోబా : ఉత్తరప్రదేశ్లో 17 ఏళ్ల యువతిని బంధించి ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ప్రవైటే కంపెనీలో పనిచేస్తున్న యువతపై గురువారం ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు, అయితే ఆమెను వారు శుక్రవారం మరో చోటికి తరలిస్తుండగా ఆ యువతి తప్పించికుందని, నిందితుల కోసం గాలింపు చేపట్టామని మొహోబా కోట్వలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆమెను వీడియో తీసిన్నట్టు యువతి పేర్కొందని, మోటార్ సైకిల్పై తరలిస్తుండగా దానిపై నుంచి దూకి యువతి తప్పించుకుందని పోలీసులు తెలియజేశారు. యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని వారు తెలిపారు.