Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యూపీ మూడోస్థానంలో ఉండటం దారుణం: అఖిలేశ్‌

లక్నో: నీతి అయోగ్‌కు చెందిన బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ)లో ఉత్తరప్రదేశ్‌ అధ్వాన స్థితిలో ఉండటంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సోమవారం బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘బీజేపీ పాలనలో ఇది మొదటి బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ). దేశంలో ఉన్న అతి దారుణమైన నగరాల్లో యూపీ మూడులో ఉంది. పోషకాహార లోపంలో మూడో స్థానంలో ఉంది. చిన్నారుల, కౌమార మరణాల విభాగంలో దేశంలోనే అత్యంత అధ్వానమైన స్థానాన్ని పొందింది’ అని అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు. అలాగే దేశంలోనే అత్యంత అధ్వానమైన నగరంలో యూపీ ఉందంటూ పత్రికలో ప్రచురితమైన ఓ కథనాన్ని తన ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img