Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

యూపీ సీఎం యోగి నామినేషన్‌ దాఖలు

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నారు. ఆదిత్యనాథ్‌, అమిత్‌షా ప్రదర్శనగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఐదుసార్లు విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img