Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రావత్‌కు నివాళులర్పించిన పొరుగు దేశాల సైనికాధికారులు

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియల్లో పొరుగు దేశాలకు చెందిన కీలక సైనికాధికారులు పాల్గొన్నారు. బిపిన్‌ రావత్‌కు నివాళులర్పించినవారిలో శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల టాప్‌ మిలిటరీ కమాండర్లు ఉన్నారు. . శ్రీలంక సైన్యం చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అండ్‌ కమాండర్‌ జనరల్‌ షవేంద్ర సిల్వ, రాయల్‌ భూటాన్‌ ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ బ్రిగేడియర్‌ డోర్జీ రించెన్‌, నేపాల్‌ సైన్యం చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బాలకృష్ణ కర్కి, బంగ్లాదేశ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డివిజన్‌ ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమన్‌ నివాళులర్పించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్‌ రావత్‌ దంపతులు, మిగిలిన సైనిక సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని భూటాన్‌ రాజు జిగ్మే కెసర్‌ నామగ్యాల్‌ దంపతులు, ఆయన తండ్రి గ్యాల్‌పో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు ఫోటోలను భూటాన్‌లోని భారత దౌత్య కార్యాలయ ట్విట్టర్‌ పోస్టు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img