కాంగ్రెస్ పార్టీ నేతతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ అన్లాక్ చేసింది. అయితే అన్లాకింగ్కు సంబంధించి ట్విట్టర్ సంస్థ ఎటువంటి వివరణ ఇవ్వలేదని ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి రోహన్ గుప్తా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా వారి ఖాతాలను లాక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్గాంధీ ట్విట్టర్పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విట్టర్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను తిరిగి అన్లాక్ చేసింది.