Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రిషబ్‌ పంత్‌కి మెరుగైన చికిత్స కోసం అవసరమైతే దిల్లీ తరలిస్తాం.. శ్యామ్‌ శర్మ

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌..అతను ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్‌ను మెరుగైన చికిత్స కోసం అవసరమైతే దిల్లీకి తరలిస్తామని దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ తెలిపారు. డీడీసీఏ టీమ్‌ మ్యాక్స్‌ ఆసుపత్రికి చేరుకుందని, అక్కడ పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలింది. తీవ్రంగా గాయపడిన పంత్‌కు మ్యాక్స్‌ ఆసుపత్రి వైద్యులు ఇప్పటికే పలు సర్జరీలు చేశారు. అయితే, పరిస్థితుల్ని బట్టి మెరుగైన చికిత్స కోసం పంత్‌ను విమానంలో దిల్లీ తరలిస్తామని శ్యామ్‌ శర్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img