Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రెండేళ్ల తర్వాత జనంలోకి దలైలామా

ధర్మశాల: కరోనా మహమ్మారి తాండవంతో రెండేళ్లుగా ఎవరికీ కనిపించని దలైలామా, తాజాగా శుక్రవారం జనంలోకి వచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని, డాక్టర్‌తోనే బాక్సింగ్‌ ఆడే శక్తి వచ్చిందని చమత్కరించారు. తనను చుట్టుముట్టున జనాన్ని ఉద్దేశించి జట్కా టేల్స్‌లోని రెండు సూక్తి వాక్యాలు చెప్పారు. అయితే తాను వైద్యపరీక్షల నిమిత్తం దిల్లీ వెళ్లాల్సి ఉందని, కానీ వెళ్లడం లేదని, తనకు వైద్యులతోనే బాక్సింగ్‌ ఆడేంతంత శక్తి ఉందని చమత్కరించారు. ఆయనను చుట్టుముట్టినవారిలో వేలమంది టిబెటన్లు, సాధువులు, కేంద్ర టిబెటన్‌ పరిపాలన సిబ్బంది ఉన్నారు. ‘ఇది చాలా మంచి శుభదినం. ఎందుకంటే ఆయన పవిత్రతను చూసి రెండేళ్లుపైగా అవుతోంది. ఆయనను చేస్తుంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. మనందరం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలి’ అని కేంద్ర టిబెటన్‌ పరిపాలన బోర్డు సభ్యుడు టెన్‌జింగ్‌ జిగ్మీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img