వాయిదా పడిన ఉభయసభలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండోరోజూ పెగాసెస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. ‘పెగాసస్’ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులతో వెల్లోకి దూసుకువచ్చారు. ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో నాలుగు నిమిషాలకే సభ వాయిదా పడిరది. లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఆందోళనల నడుమే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.సభ్యులు వెల్లోకి దూసుకురావడంతో.. సభను చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.