Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి : మాయావతి

లక్నో : రద్దయిన నల్ల వ్యవసాయ చట్టాలపై కొంతమంది బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. వీలైతే రైతుల్లో ఆత్మస్థయిర్యం పెంచేలా మాట్లాడాని ఆమె సూచించారు. రద్దయిన చట్టాల సంగతి అలా ఉంచితే, ఆందోళన చేస్తున్న నాయకులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి వాళ్లను ఇళ్లకు పంపించాలని ఆమె ఓ ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు. ‘అదే సమయంలో నల్ల చట్టాల రద్దుపై రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపాలి. అయితే ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు, అయోమయస్థితి కల్పిస్తున్నారు. వారంతా తక్షణమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపాలి’ అని ఆమె సూచించారు. అవసరమైతే ఈ చట్టాలను మళ్లీ తీసుకొస్తామంటూ బీజేపీ మధ్యప్రదేశ్‌, ఉన్నావ్‌ ఎంపీ సాక్షి మహరాజ్‌ చేసి వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img