నీట్-పీజీ కౌన్సెలింగ్లో జాప్యాన్ని నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు, పోలీసులకు మధ్య జరిగిన గొడవ జరగ్గా..ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పలువురు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు… ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయవాది వినీత్ జిందాల్ మాట్లాడుతూ, దేశంలో ఒమిక్రాన్ ముప్పు రోజు రోజుకూ పెరుగుతోందని, వైద్యుల సమ్మెపై తగిన చర్యలు తీసుకునేలా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అలాగే నిరసన తెలిపిన వైద్యుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.