రేపు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిపోయే విమానాలకు అధికారులు కొన్ని పరిమితులు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రేపు ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అధికారులు చార్టెడ్ ఫ్లైట్స్ ఆపరేషన్స్పై కొన్ని పరిమితులు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. షెడ్యూల్డ్ విమానాలు అన్నీ షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి.