పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రేపు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు పాల్గొంటారు.దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై, కొవిడ్ చర్యలు, కొవిడ్ కేసులతో పాటు మరికొన్ని కీలకమైన విషయాలను ప్రధానంగా ఈ సమావేశం చర్చించనుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో ప్రధాని ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధాని కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిరచాయి.