దేశవ్యాప్తంగా 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాని ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు సాగుతోంది. ఈ వేడుకలో కొత్తగా చేరిన 75,000 మంది నియామక పత్రాలను అందజేసినట్టు తెలిపారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, ఎనిమిదేళ్లలో దేశం 10వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని మోడీ అన్నారు. భారతదేశం.. యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచిందని తెలిపారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనాలు ఉన్నాయన్నారు.