Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రౌత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మరోసారి కస్టడీ పొడిగింపు

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడిరది. వచ్చే నెల 2న రౌత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్టు.. ఈడీ స్పెషల్‌ కోర్టు తెలిపింది. అదేవిధంగా ఇవాళ్టితో ముగిసిన రౌత్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా ఈడీ కోర్టు మరోసారి పొడిగించింది.బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే తేదీ అయిన నవంబర్‌ 2 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడిరచింది. పాత్రా వాలా చాల్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసులో పలువురిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది.అందులో భాగంగానే గత ఆగస్టు 1న ఈడీ సంజయ్‌ రౌత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లు తన కస్టడీలో ఉంచుకుని ఇంటరాగేట్‌ చేసింది. తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. స్పెషల్‌ కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అయితే విచారణ ఇంకా పూర్తికాలేదన్న ఈడీ అభ్యర్థనలతో కోర్టు రౌత్‌ కస్టడీని పొడిగిస్తూ వస్తున్నది. చివరిసారిగా విధించిన కస్టడీ ఇవాళ్టితో ముగియగా మరోసారి కస్టడీని పొడిగించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img