టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహాయిన్కు అసోం రాష్ట్ర ప్రభుత్వం వరాలు జల్లు కురిపించింది. డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడంతోపాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. గువాహటిలోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమె స్వస్థలం గోలాఘాట్లో రూ. 25 కోట్లతో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్కు రూ.10 లక్షలు చెల్లిస్తామన్నారు.సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ గురువారం ఆమెకు స్వయంగా స్వాగతం పలికారు. ఆమె ఒలింపిక్స్లో విజయం సాధించి, లక్షలాది మంది కలలను ప్రేరేపించారని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు.