Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లోక్‌సభలో వైసీపీ ఎంపీల ఆందోళన


పోలవరం ప్రాజెక్ట్‌పై లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలపై కేంద్రం ఆమోదం తెలపాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే వచ్చే ఏడాది కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని డిమాండు చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్‌, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్‌ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img