: ప్రియాంక గాంధీ
ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఉజ్వల స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి నిధులను పెంచుకుంటోందన్నారు. ఎల్పీజీ ధరను పెంచుతూ మోదీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతోందని, వారి జేబుకు చిల్లు పెడుతూ డబ్బు దండుకుంటోందని ట్వీట్ చేశారు. జులై 1న ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ 25 పెంచి..మళ్లీ ఈనెల 17న రూ 25 పెంచిందన్నారు.