Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వడ్డీరేట్లు యథాతథం

ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఊహించని రీతిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయా న్ని మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సమర్థించినట్లు వెల్లడిరచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.2 శాతం ఉంటుందని లెక్కగట్టింది. బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలు బాగున్నాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. ఇటీవల అభివృద్ధి చెందిన దేశాల్లో
బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొ న్నారు. ఈ బ్యాంకుల వైఫల్యం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలిపారు. ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం విషయంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొ నడానికి అప్రమత్తంగా ఉన్నట్లు దాస్‌ చెప్పారు. యూపీఐ వ్యవస్థనుస్థ విస్తరించడానికి ముందస్తుగా మంజూరైన క్రెడిట్‌ లైన్లు నిర్వ హించుకునేలా బ్యాం కులకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా ఆర్బీఐ పనిచేస్తోందన్నారు. క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల కోసం వివిధ బ్యాంకుల్లో వెతకడానికి ఆర్బీఐ కేంద్రీకృత పోర్టళ్లను ఏర్పాటు చేస్తుందని వెల్లడిరచారు. డిపాజిటర్లు యాక్సెస్‌ను మెరుగుపరచడం, విస్తృతం చేయడం కోసం క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల కోసం బహుళ బ్యాంకుల్లో వెతకడానికి వీలుగా వెబ్‌ పోర్టళ్ల ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ గతేడాది మే నుంచి కీలక వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోం ది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది ఆర్బీఐ. అంతకుముందు ఫిబ్రవరిలో రెపో రేటును పెంచింది. 6.25 శాతం ఉన్న రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.5 శాతంగా నిర్ణయించింది. ప్రపంచ బ్యాం క్‌ తన తాజా ‘ఇండియా డెవలప్మెంట్‌ అప్డేట్‌’ (ఐడీయూ)లో జీడీపీని 2023-24లో 6.6 శాతంగా అంచనా వేయగా.. దానిని 6.3 శాతానికి తగ్గించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img