మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న వీరు ఆయనకు పుష్పగుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటించారు. స్మారకం వద్ద నివాళులర్పించిన వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.