Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విమానాల్లో వరుస ఘటనలు.. మద్యం పాలసీపై ఎయిరిండియా కీలక నిర్ణయం

ఇటీవల తమ సంస్థ విమానాల్లో జరుగుతోన్న వరుస సంఘటనలతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించే విధానానికి జనవరి 19న కొన్ని సవరణలు చేసింది. ఎవరైనా ఒక మోతాదుకు మించి మద్యం తీసుకుంటున్నారని భావిస్తే వారికి సర్వ్‌ చేయడానికి నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. అయితే, అది గౌరవప్రదమైన విధానంలో ఉండాలని పేర్కొంది. ‘ఇక మద్యం ఇవ్వం’ అని చెప్పే సందర్భంలో వారిని తాగుబోతు అని పిలవడం, వాదనకు దిగడం, హెచ్చుగా మాట్లాడటం వంటివి చేయకూడదని సూచించింది. సొంతంగా మద్యం తెచ్చుకుని తాగే ప్రయాణికులను గుర్తించే బాధ్యత సిబ్బందిదేనని స్పష్టం చేసింది. ఇటీవల రెండు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణీకుల వికృత ప్రవర్తనకు సంబంధించి ఎయిరిండియాకు డీజీసీఏ జరిమానాలు విధించింది. విమానాల్లో ప్రయాణికులకు మద్యం అందించడం చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే మద్యం సేవించడం, అందుకోసం సంప్రదించడం మధ్య వ్యత్యాసం ఉందని ఎయిరిండియా పేర్కొంది.‘‘ఎయిర్‌ ఇండియా తన క్యాబిన్‌ సిబ్బందికి మద్యం సేవలను తిరస్కరించడానికి లేదా అతిథి సొంతంగా తీసుకొచ్చే ఆల్కహాల్‌ను పరిమితి మించితే అడ్డుకోడానికి అధికారం ఇస్తుంది.. పరిమితికి మించి మద్యం సేవించడం వల్ల విమానంలోని మిగతావారు, సిబ్బంది ఇబ్బంది పడతారనడానికి సహేతుకమైన కారణం ఉంది.. మద్య పానీయాల సేవను సహేతుకమైన, సురక్షితమైన పద్ధతిలో నిర్వహించాలి. అతిథి మద్యం సేవించడానికి (మరింత) వ్యూహాత్మకంగా నిరాకరించడం ఇందులో ఉంది’’ వైమానిక సంస్థ తెలిపింది.అమెరికా నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ మార్గదర్శకాలు, ఇతర విమానయాన సంస్థల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే ఉన్న విమానంలో ఆల్కహాల్‌ సర్వీస్‌ విధానాన్ని సమీక్షించిందని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.ఇవి ముఖ్యంగా ఎయిర్‌ ఇండియా ప్రస్తుత విధానానికి అనుగుణంగా ఉన్నాయి.. అయినప్పటికీ మెరుగైన స్పష్టత కోసం కొన్ని సర్దుబాట్లు చేశాం. కొత్త విధానం ఇప్పుడు సిబ్బందికి తెలియజేశాం.. శిక్షణా పాఠ్యాంశాల్లో చేర్చాం.. మద్యం బాధ్యతాయుతమైన సేవతో సహా పరిమితం కాకుండా మా ప్రయాణీకులు, క్యాబిన్‌ సిబ్బంది భద్రత, శ్రేయస్సు కోసం ఎయిర్‌ ఇండియా కట్టుబడి ఉంది’ ప్రతినిధి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img