Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి..

విహారయాత్రలో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. ఈ కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి తర్వాత ఘోరం జరిగింది. టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులతోపాటు ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదంలో మొత్తం 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు, కారును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టూరిస్ట్‌ బస్సు కెఎస్‌ఆర్‌టిసి బస్సు వెనుక భాగాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని కేరళ మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img