ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. సుమారు 150 కోట్ల రూపాయల విలువైన నోట్లను ఇప్పటికే లెక్కించారు. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే, యూపీకి చెందిన పీయూష్ జైన్ కాన్పూర్లో పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ నడుపుతున్నాడు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న పీయూష్ జైన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. కాన్పూర్లో ఉన్న పీయూష్ ఇంట్లో సోదాలు జరుపుతుండగా రెండు బీరువాలు అనుమానాస్పదంగా కనిపించాయి. తెరిచి చూసేసరికి కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేల్చారు. పీయూష్ జైన్కు చెందిన మహారాష్ట్ర, గుజరాత్లోని కార్యాలయాలపై అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.