శ్రీనగర్: తగిన వర్షాలు పడకపోవడం, వేడి వాతావరణం కారణంగా శ్రీనగర్లో ఆసియోలోనే అతిపెద్దదైన తులిప్ పూల ఉద్యానవనాన్ని మూసివేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ఉద్యానవనాన్ని 3.60 లక్షమంది సందర్శించారు. నీళ్లు లేకపోవడంతో ప్రఖ్యాతి చెందిన దాల్లేఖ్ సరస్సు కుంచించుకుపోతుండటంతో సోమవారం నుంచి సందర్శనను నిలిపివేసినట్టు సరస్సు ఇన్చార్జి ఇనామ్ రెహ్మాన్ సోఫీ తెలిపారు. దాదాపు 26 రోజుల తర్వాత తులిప్ పువ్వులు తగ్గిపోవడంతో ఉద్యానవనాన్ని మూసిశారు. ‘పువ్వులు వికసించేలా మేం అన్ని చర్యలూ చేపడుతున్నాం. మా ఉద్యోగులు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రిళ్లు మొగ్గలపై నీళ్లను చల్లుతున్నారు. అయితే, తగిన వర్షం లేకపోవడం, అనూహ్యంగా వేడి పెరిగిపోవడంతో మొగ్గ తొందరగా కుంచించుకుపోతోంది’ అని సోఫీ వివరించారు.