జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. భారత్తో సహా పలు దేశాలు ఆయన మృతికి సంతాపం తెలిపాయి. అబెతో ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన మృతికి నివాళిగా భారత్ జులై 9న అంటే శనివారం జాతీయ సంతాపం దినంగా పాటించాలని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనతం చేశారు. దిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలపై జాతీయ జెండాలను సగం వరకు కిందకు దించారు.జపాన్లోని నారా రీజియన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అబెను ఓ వ్యక్తి కాల్పులు జరపగా… అక్కడే కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయన్ను ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోయింది. అబె మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిపై మోడీ ఓ బ్లాగ్లో ఇలా రాశారు. ‘మై ఫ్రెండ్, అబె సాన్’ అనే శీర్షికతో ఇలా పేర్కొన్నారు. ‘అబె మరణంతో, జపాన్, ప్రపంచం ఒక గొప్ప దూరదృష్టిని కోల్పోయింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను’’ అని రాసుకొచ్చారు.