జమ్ముకాశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి.ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్లోని చెర్మార్గ్, జైన్పొరాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అతడు ఏ గ్రూప్నకు చెందినవాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు.