ఉగ్రవాది హతం
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు.సోమవారం జమ్మూకశ్మీరులోని పూంచ్ సెక్టారులోని నియంత్రణ రేఖ వద్ద పాక్ మద్ధతు ఉన్న ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా,భారత సైనిక దళాలు ఇంటిగ్రేటెడ్ నిఘా గ్రిడ్ ద్వారా సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గుర్తించాయి. చొరబాటుదారులను నిలిపివేయడంతో వారు కాల్పులకు దిగారు. దీంతో సైనికులు చొరబాటుదారులపై ఎదురుకాల్పులు జరపగా, ఈకాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు.