నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
సిగరెట్ పెట్టెలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరిక కనిపించబోతోంది. దేశీయంగా తయారు చేసే పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకునేవి, లేదా ఇక్కడ ప్యాక్ చేసే పొగాకు ఉత్పత్తులపై డిసెంబర్ 1 నుంచి నూతన ఇమేజ్ తో కూడిన హెచ్చరికను ముద్రించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఎంతో బాధతో కూడిన చావుకు పొగాకు కారణమవుతుంది’’ అనే హెచ్చరికతో ప్యాక్లపై ఫొటోతోపాటు హెచ్చరిక ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ హెచ్చరిక ఏడాది పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది.