న్యూదిల్లీ: సివిల్ సర్వీసెస్`2021 పరీక్షలో జాతీయస్థాయిలో టాపర్గా నిలిచిన శృతిశర్మ 54.56శాతం, రెండో స్థానంలో నిలిచిన అంకితా అగర్వాల్ 51.85శాతం మార్కులు సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడిరచింది. మొత్తం 685 మంది అభ్యర్థులు (508 మంది పురుషులు, 177 మంది మహిళలు) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను కమిషన్ సోమవారం ప్రకటించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)ల కోసం అధికారులను ఎంపిక చేయడానికి ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో యూపీఎస్సీ ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలో 400 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలతో రెండు పేపర్లు ఉంటాయి. ఈ దశ స్క్రీనింగ్ పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు. తుది ఎంపికలో వీటిని లెక్కించరు. ప్రధాన పరీక్షలో ప్రవేశానికి అర్హత సాధించిన అభ్యర్థుల తుది మెరిట్ మొత్తం 2,025 మార్కులలో నిర్ణయించబడుతుంది. రాత లేదా మెయిన్ పరీక్ష 1,750 మార్కులు, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటాయి. యూపీఎస్సీ వెల్లడిరచిన అభ్యర్థుల మార్కుల ప్రకారం… శృతిశర్మకు మొత్తం 1,105 మార్కులు వచ్చాయి. రాత పరీక్షలో 932, ఇంటర్వ్యూలో 173. అగర్వాల్కు మొత్తం 1,050 మార్కులు రాగా, రాతపరీక్షలో 871, ఇంటర్వ్యూలో 179 మార్కులు సాధించారు.