కపుర్తలా: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి భగవంత్మాన్ హోర్డింగ్లను మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు ఆరోపించారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనను అభినందిస్తూ హోర్డింగ్లు పెట్టామని, వాటికి రూ.2 లక్షలకు పైగా ఖర్చయిందని ఆప్ నాయకుడు పర్మీందర్ సింగ్ ధోత్ తెలిపారు. ఇప్పటికీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కాంగ్రెస్ పాలనలోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. గురువారం సీఎంకు సంబంధించిన హోర్డింగులను తొలగించి చెప్పకుప్పలో వేయడం, సీఎంను అవమానపరచడమేనన్నారు. తక్షణమే మునిసిపల్ శాఖ అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎక్కడనుంచైతే హోర్డింగ్లు తొలగించారో అక్కడ కొత్త హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తప్పకుండా అధిష్టానానికి తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై మునిసిపల్ కమిషనర్ ఆదిత్య ఉప్పల్ను వివరణ అడగ్గా, తనకు ఈ విషయం గురించి తెలియదని, ఎటువంటి హోర్డింగులు తొలగించమని ఆదేశాలు జారీ చేయలేదని, కానీ తక్షణమే కొత్త హోర్డింగ్లు పెట్టేలా అధికారులను ఆదేశిస్తానని ఆయన తెలిపారు.