Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీఎస్‌పై దాడి కేసులో కేజ్రీవాల్‌కు భారీ ఊరట

దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిపై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు భారీ ఊరట లభించింది.దిల్ల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర 9 మంది ఇతర ఎమ్మెల్యేలను దిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018లో అప్పటి దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై కేజ్రీవాల్‌, సిసోడియా, 11 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు నమోదైన కేసులో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సచిన్‌ గుప్తా బుధవారం తీర్పు వెల్లడిరచారు. ఈ వివరాలను మనీశ్‌ సిసోడియా విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో అన్ని ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఈ తప్పుడు కేసు నుంచి ముఖ్యమంత్రి నిర్దోషిగా బయటపడ్డారన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా ఈ కేసును అభివర్ణించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని తాము చెబుతూనే ఉన్నామన్నారు. సత్యానికి, న్యాయానికి లభించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img