భారత త్రివిధ దళాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ (శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. భారత రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా చౌహాన్ నియమితులయ్యారు. డిసెంబర్ 2021లో మొదటి జనరల్ బిపిన్ రావత్ చనిపోయినప్పటి నుంచి ఈ పోస్ట్ తొమ్మిది నెలలకు పైగా ఖాళీగా ఉంది. సీడీఎస్గా తన మొదటి ప్రసంగంలో అతను భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి అంచనాలను నెరవేరుస్తానని, అన్ని సవాళ్లు.. ఇబ్బందులను కలిసి పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు.