శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో వచ్చే నెల 18వ తేదీకి ఢల్లీి కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈలోపుగా పోలీసులు కేసుకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతినిచ్చింది. ఈ కేసుపై కేసుపై గత ఏడేళ్లుగా ఢల్లీి కోర్టులో పలు దఫాల్లో విచారణ జరిగింది. ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఢల్లీి పోలీసులు కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతి ఇస్తూ తీర్పును ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.సునంద పుష్కర్ 2014, జనవరి 17న ఢల్లీిలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.